BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 09:01 PM
218 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి, జూలై 10: చాట్రాయి మండలంలోని చాట్రాయి, కోటపాడు, చీపురుగూడెం, పోలవరం గ్రామాల సబ్‌స్టేషన్ల పరిధిలో శనివారం (జూలై 11) విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించారు. చాట్రాయి గ్రామంలో మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనులు చేపట్టనుండగా, పాత 33 కేవీ విద్యుత్ లైన్‌తో పాటు సబ్‌స్టేషన్లలో నెలసరి నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పనుల నేపథ్యంలో చాట్రాయి, కోటపాడు, చీపురుగూడెం, పోలవరం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ డి. సంజయ్ విజ్ఞప్తి చేశారు.