చాట్రాయి మండలంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
చాట్రాయి, జూలై 10: చాట్రాయి మండలంలోని చాట్రాయి, కోటపాడు, చీపురుగూడెం, పోలవరం గ్రామాల సబ్స్టేషన్ల పరిధిలో శనివారం (జూలై 11) విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించారు. చాట్రాయి గ్రామంలో మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనులు చేపట్టనుండగా, పాత 33 కేవీ విద్యుత్ లైన్తో పాటు సబ్స్టేషన్లలో నెలసరి నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పనుల నేపథ్యంలో చాట్రాయి, కోటపాడు, చీపురుగూడెం, పోలవరం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ డి. సంజయ్ విజ్ఞప్తి చేశారు.