బూరుగుగూడెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన శ్రీరాములు ఆకస్మిక మరణం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన శ్రీరాములు మరణించారు గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆకస్మికంగా రాత్రి 9గంటల ప్రాంతంలో మరణించారు ఆయన తెలుగుదేశం పార్టీకి,ప్రజలకు ఎంతో సేవ చేశారు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులుగా అనేక పర్యాయాలు కొనసాగారు. ఆయనకు భార్య ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రాజబోయిన దశరథ రామరాజు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాజబోయిన శ్రీరాములు మరణం పట్ల చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, టిడిపి సీనియర్ నేతలు మందపాటి బసవా రెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి వెంకటేశ్వరరావు, బొట్టు లక్ష్మణరావు, తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర సంతాపం ప్రకటించారు