BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 07:58 pm
Posted by : కూనురు మధు

భగవద్గీత బోధనలు మానవ జీవితానికి దిశానిర్దేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Sep, 2026 - 07:58 PM
17 వీక్షణలు

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

చిట్యాల : Ntoday News

భగవద్గీత బోధనలు మానవాళికి దిశా నిర్దేశంగా ఉంటాయని గ్రీన్ గ్రోవ్ పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉట్టిపడేలా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత బోధనలు మానవ జీవితానికి దిశానిర్దేశం  చేస్తాయని. ఫలితాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలనే ఫలితం లభిస్తుందని తెలిపారు. 
కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ధర్మం కోసం నిలబడాలని శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయని, అన్నారు.  కోపం, అహంకారం, మితిమీరిన ఆశలను అదుపులో ఉంచుకుని సమతా భావంతో జీవించాలని అన్నారు. పండుగలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. అనంతరం  చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, భక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్ మరియు ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు