తెలంగాణలో నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తమ ఫొటో, తల్లిదండ్రుల సంతకం సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
ప్రవేశానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష వివరాలను అధికారిక నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.