తోటగూడెం ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి: బీజేపీ డిమాండ్
లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని తోటగూడెం ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీ గ్రామ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రహరీ గోడ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు, గ్రామ పాలకమండలి వెంటనే స్పందించి ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణ పనులకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, భవిష్యత్తులో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత గ్రామ పాలకమండలి నాయకులు, నిర్మాణాన్ని అడ్డుకునే వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
విద్యార్థుల భద్రత, పాఠశాల అభివృద్ధి కోసం తోటగూడెం ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని వారు తెలిపారు.