రావులపాలెంలో పనీర్పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
అమలాపురం: రావులపాలెంలో పనీర్ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పనీర్ తిన్న అమలాపురానికి చెందిన ఓ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందినట్లు సమాచారం. దీనిపై స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లోని ఐదు మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న పాల ఉత్పత్తులు, ముఖ్యంగా పనీర్ నాణ్యతను పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా పనీర్ నమూనాలను అధికారులు సేకరించారు. సేకరించిన శాంపిల్స్ను పరీక్షల కోసం మద్రాస్లోని ల్యాబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగశాల నివేదికలు వచ్చిన తర్వాత పనీర్ నాణ్యతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పనీర్ తయారీ, విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలన చేపట్టారు. ల్యాబొరేటరీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.