ఎస్ఐలుగా ప్రమోషన్ పొందిన అధికారులకు వరంగల్ సీపీ అభినందనలు
తెలంగాణ
/
హన్మకొండ
వరంగల్, NTODAY న్యూస్: పోలీసు శాఖలో ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సదానందం, మోహన్రావు, రమేశ్, రవీందర్రెడ్డి, పాపయ్య వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీపీ శ్వేత పదోన్నతి పొందిన అధికారులను అభినందించారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు.
పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని, ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ సూచించారు. అనంతరం ఎస్ఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.