BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 11:36 pm
Posted by : M. రాజశేఖర్

భారతికి పీహెచ్‌డీ పట్టా ప్రదానం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
17 Sep, 2026 - 11:36 PM
4 వీక్షణలు

కుప్పం, NTODAY న్యూస్: ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలోని తమిళ భాష, అనువాద అధ్యయనాల విభాగం పరిశోధక విద్యార్థిని భారతికి పీహెచ్‌డీ పట్టా లభించింది. ప్రొఫెసర్ సుబ్బు రెడ్డియార్ జీవిత చరిత్రలోని సామాజిక, సాంస్కృతిక సందేశాలపై ఆమె చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు.

విభాగాధిపతి డాక్టర్ పి.ఎస్. గణేష్ మూర్తి పర్యవేక్షణలో భారతి తన పరిశోధనను పూర్తి చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. పరిశోధనలో భాగంగా సుబ్బు రెడ్డియార్ జీవిత చరిత్రలో ప్రతిబింబించిన సామాజిక, సాంస్కృతిక అంశాలను ఆమె విశ్లేషించినట్లు పేర్కొన్నారు.

పీహెచ్‌డీ పట్టా పొందిన భారతిని ద్రావిడ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది అభినందించారు. ఆమె భవిష్యత్‌లో మరిన్ని పరిశోధనలు కొనసాగించాలని ఆకాంక్షించారు.