BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 11:23 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

సింగరేణి సత్తుపల్లి ఏరియాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
17 Sep, 2026 - 11:23 PM
1 వీక్షణలు

సత్తుపల్లి, NTODAY న్యూస్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ సత్తుపల్లి ఏరియాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సత్తుపల్లి స్పెషల్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్. వెంకటాచారి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జనరల్ మేనేజర్ ఎస్. వెంకటాచారి మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సెక్యూరిటీ సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించడంతో పాటు సంస్థ పురోగతికి ఉద్యోగుల పాత్రపై కార్యక్రమంలో చర్చించారు.

వేడుకలకు ఎస్‌ఓటుజీఎం బొల్లం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్. సుధాకర్, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు, సీఎంఓఏఐ సత్తుపల్లి ఏరియా అధ్యక్షుడు ఏఎల్‌ఎస్‌వీ సునీల్ వర్మ, సత్తుపల్లి ఏరియా ఇంజినీర్, పర్చేజ్ ఆఫీసర్, వివిధ గనులు, విభాగాల హెచ్‌ఓడీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.