కుప్పం: సేవా సంకల్ప అభియాన్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
ఆంధ్రప్రదేశ్
కుప్పం: సేవా సంకల్ప అభియాన్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
కుప్పం: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్”లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఎన్.కొత్తపల్లి, విలేజ్ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో డాక్టర్ సుభాష్ రాజా, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా శిబిరాలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.