చాట్రాయి జెడ్పీ హెచ్ ఎస్ ఉపాధ్యాయుడు గుడ్డల అమరయ్యకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
చాట్రాయి, సెప్టెంబరు 5: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడ్డల అమరయ్యకు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది.
ఏలూరులో నిర్వహించిన జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా అమరయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తున్నందుకు ఆయనను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేశారు.
కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో అమరయ్యకు జిల్లా ఉపాధ్యాయ పురస్కారం అందజేశారు.
అమరయ్యకు అభినందనలు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన గుడ్డలు అమరయ్యను చాట్రాయి మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీనివాస్, వీఎస్వీ బ్రహ్మాచారి, చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య అభినందించారు. అమరయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల సేవలు కీలకం
ఈ సందర్భంగా ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు లభించడం ఎంతో సంతోషకరమన్నారు.
గుడ్డల అమరయ్యకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం చాట్రాయి మండలానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి పురస్కారం అందించడం ఇతర ఉపాధ్యాయులకు కూడా స్ఫూర్తినిస్తుందని మాసగిరి శ్రీనివాస్ అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అమరయ్యను అభినందించారు.