చాట్రాయిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు
చాట్రాయి, ఆగస్టు 2: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో సీనియర్ టీడీపీ నేత మందపాటి బసవారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గడ్డం ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ కోట జోజి, మరీదు శ్రీనివాస రావు, తోటకూర వెంకటేశ్వరరావు, శంఖు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.