BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 04:36 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

టీబీ నిర్మూలనకు ఉచిత మొబైల్ ఎక్స్‌రే సేవలు ​ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
16 Sep, 2026 - 04:36 PM
7 వీక్షణలు

టీబీ నిర్మూలనకు ఉచిత మొబైల్ ఎక్స్‌రే సేవలు

​ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

ధర్మపురి: టీబీ వ్యాధి నిర్మూలన అభియాన్‌లో భాగంగా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శాఖ, జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మొబైల్ ఎక్స్‌రే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ (DY DMHO) డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజలందరూ వైద్య శాఖ అందిస్తున్న ఉచిత టీబీ పరీక్షలు, మొబైల్ ఎక్స్‌రే సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. టీబీ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ప్రతి నెలా ₹1,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు.   గత నాలుగు నెలల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా టీబీ బాధితులకు సుమారు ₹45 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.

​అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. టీబీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత వారం బస్తీ దవాఖానలో, ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సిబ్బందికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, కౌన్సిలర్లు అయ్యోరి వేణుగోపాల్, ముడుసుల ప్రశాంత్, విరవేణి నాగలక్ష్మి, సంగి ఆనంద్, కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా, డాక్టర్ వివేక్, మున్సిపల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.