BREAKING
అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
www.ntodaynews.com

చెర్వుగట్టు ఆలయ నిధుల దుర్వినియోగం : కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
08 Jun, 2026 - 08:24 PM
10 వీక్షణలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు గుట్ట కింద ఉన్న పార్వతమ్మ దేవస్థానంలో రూ. 1,03,000/- ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ డి. వంశీకృష్ణరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.​ఆలయ రోజువారీ ఆదాయ రిజిస్టర్ డిసిబి బ్యాంకు డిపాజిట్లను సీనియర్ అసిస్టెంట్ సిహెచ్. లింగయ్య పరిశీలించగా తేడాలు బయటపడ్డాయి. మే 19న ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవస్థాన చైర్మన్, ఈవో, ధర్మకర్తల మండలి సమక్షంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇందులో కోడె త్రిప్పికట్టు టికెట్ల ద్వారా రూ. 89,500, గది కిరాయిల ద్వారా వచ్చిన రూ. 13,500 కలిపి మొత్తం రూ. 1.03 లక్షల ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయకుండా, రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసి వంశీకృష్ణరావు సొంతానికి వాడుకున్నట్లు తేలింది.

​దీనిపై వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో జూన్ 25న జరిగిన పాలకమండలి సమావేశంలో సదరు ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి  ఎస్. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.