BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

చింతలపూడి మాస్టర్ ప్లాన్ అమలు ఇప్పటికైనా జరుగుతుందా?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
43 వీక్షణలు


చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి: చింతలపూడి పట్టణ మాస్టర్ ప్లాన్ అమలు ఇప్పటికైనా ప్రారంభమవుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1993లో డీటీసీపీ (DTCP) ఆమోదం పొందిన ఈ మాస్టర్ ప్లాన్‌కు దాదాపు 33 సంవత్సరాలు గడిచినా అమలు మాత్రం ముందుకు సాగలేదు. ఈ కాలంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మారినా మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోకపోవడం ప్రజల్లో నిరాశను కలిగిస్తోంది.

ముఖ్యంగా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రింగ్ రోడ్డు ఇప్పటికీ నిర్మాణం కాకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపాదిత రింగ్ రోడ్డు మార్గంలో అక్రమ లే అవుట్లు, అనుమతి లేని నిర్మాణాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి ప్రతిపాదిత రింగ్ రోడ్డు మార్గంలోని అక్రమ ఆక్రమణలను తొలగించడం లేదా పరిస్థితులకు అనుగుణంగా అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి పనులను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే అక్రమ లే అవుట్లు, నిర్మాణాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ పట్టణ అభివృద్ధికి అనుగుణంగా క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చింతలపూడి మాస్టర్ ప్లాన్‌కు ఇకనైనా మోక్షం లభించి, కనీసం రింగ్ రోడ్డు నిర్మాణమైనా ప్రారంభమవుతుందా? అనే ప్రశ్నకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యాచరణతోనే సమాధానం చెప్పాల్సి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.