BREAKING
5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం
www.ntodaynews.com

చింతలపూడి సర్కిల్‌లో జూద శిబిరాలపై పోలీసుల దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Mar, 2026 - 06:00 AM
90 వీక్షణలు

చింతలపూడి సర్కిల్‌లో జూద శిబిరాలపై పోలీసుల దాడులు – 32 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో విస్తృత స్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో, వివిధ పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో కోడిపందాలు, పేకాట ఆడుతున్న 32 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ. 30,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జూద శిబిరాల వద్ద నిలిపి ఉంచిన 20 మోటార్ సైకిళ్లను సీజ్ చేయగా, పందాలకు సిద్ధం చేసిన 14 కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. యువతను తప్పుదారి పట్టించే ఇలాంటి చర్యలపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.