BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 May, 2026 - 06:33 PM
342 వీక్షణలు

చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి: ఇజ్జిగాని వెంకటేశ్వరావు

చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు.

రేపు, ఎల్లుండి అనగా మే 27, 28 తేదీలలో క్లస్టర్-1 చిన్నంపేట, క్లస్టర్-2 ఆరుగొలనుపేట గ్రామాలలో మహానాడు వీక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా పెద్దఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

మహానాడు కార్యక్రమం తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమైందని, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై రెండు రోజుల పాటు ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

సభ్యత్వ కార్డులు కలిగిన కార్యకర్తలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.