చిట్యాలలో ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక
చిట్యాలలో ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, అసమానతలు మరియు వివక్ష లేని సమాజం కోసం యావత్ జాతిని ఏకం చేసేందుకు నూతన కమిటీలకు ఎంతో బాధ్యత ఉందన్నారు. అందులో భాగంగానే పాత కమిటీలను రద్దు చేసి, నూతన కమిటీలను ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. నూతన కమిటీలో మండల మండలాధ్యక్షునిగా పొలిమేర దశరథ
ప్రధాన కార్యదర్శి గా జోగు ప్రవీణ్, అధికార ప్రతినిధి ఎరసాని లింగస్వామి , ఉపాధ్యక్షులు గా ఉష్కిల రవి, జోగు నగేష్ కార్యదర్శులుగా మాంకాల శ్రీను , అంబాల నవీన్
సహాయ కార్యదర్శిగా మేడి లింగస్వామి ఎన్నికయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎరసాని గోపాల్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం మాదిగ, సీనియర్ నాయకులు నక్క కృష్ణ మాదిగ, మాజీ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగతో పాటు నాయకులు జోగు సురేష్, నల్లబెల్లి రమేష్, జోగు లింగస్వామి, సుక్క నరసింహ, పెరిక లింగస్వామి, బోయ దేవి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.