చిట్యాలలో రైతు వేదికలో 3 రోజుల రైతు మేళా : వ్యవసాయ అధికారి గిరిబాబు
చిట్యాలలో రైతు వేదికలో 3 రోజుల రైతు మేళా : వ్యవసాయ అధికారి గిరిబాబు
ప్రస్తుతం ఎల్-నినో ప్రభావం వల్ల సరైన వర్షపాతం లేకపోవడంతో వరి సాగుకు అనుకూలమైన పరిస్థితులు లేవని, రైతులు వరి నాట్లను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను వైపు మొగ్గు చూపాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు.ఈ క్రమంలో రైతులను చైతన్యపరిచేందుకు చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 27 నుండి 29 వరకు(మూడు రోజుల పాటు ప్రత్యేక రైతు మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు మేళాలో రైతులకు కంది, పెసర, మినుము, నువ్వులు మరియు జనపనార విత్తనాలు అందుబాటులో ఉంటాయని, ఈ మూడు రోజులు రైతులు రైతు వేదికకు విచ్చేసి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పరిశీలించి, వ్యవసాయ అధికారుల నుండి అవసరమైన సలహాలు తీసుకోవచ్చు. అని తెలిపారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.