BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 10 September 2026, 12:21 pm
Posted by : DAVU RAVINDER REDDY

పోలీసులకు ఈహెచ్ఎస్ కష్టాలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నో అడ్మిషన్?

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
10 Sep, 2026 - 12:21 PM
13 వీక్షణలు

వైద్య సేవల్లో జాప్యం.. రూ.లక్షల్లో ఖర్చులు భరించాల్సి వస్తోందని పోలీసుల ఆవేదన

హైదరాబాద్ | Ntoday News

విధి నిర్వహణలో ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనే పోలీసు సిబ్బందికి ఇప్పుడు వైద్య చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈహెచ్ఎస్ (Employees Health Scheme) అమలులో సమస్యల కారణంగా అత్యవసర వైద్యం అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లోని ఓ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అత్యవసరంగా అవసరమైన ఓ ఇంజక్షన్ కోసం సుమారు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఆ మందుకు ఈహెచ్ఎస్‌లో అనుమతి లేదని చెప్పడంతో భారీ మొత్తాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

డెలివరీ తర్వాత పసికందుకు చికిత్స.. అప్పు కోసం వెతుకులాట

మరో ఘటనలో ఓ కానిస్టేబుల్ భార్య ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవించగా, వారికి కుమారుడు జన్మించాడు. అయితే కొద్దిసేపటికే శిశువుకు జాండిస్ రావడంతో ఇంక్యుబేటర్‌లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఈహెచ్ఎస్ కింద చికిత్సకు సంబంధించిన చెల్లింపులపై ఆస్పత్రి యాజమాన్యం నగదు చెల్లించాలని చెప్పడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

శిశువు చికిత్సకు లక్షల రూపాయలు అవసరమని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ అప్పు కోసం ప్రయత్నించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.

‘ఈహెచ్ఎస్ కింద చికిత్స చేయం’

హైదరాబాద్‌కు చెందిన మరో కానిస్టేబుల్ వైద్యం కోసం ఓ కార్పొరేట్ ఆస్పత్రిని సంప్రదించగా.. పోలీసు సిబ్బందికి ఈహెచ్ఎస్ కింద చికిత్స అందించడం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపినట్లు సమాచారం. తమకు ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

దీంతో అత్యవసర వైద్యం అవసరమైన సమయంలోనూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడం కష్టంగా మారుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీతం నుంచి 1.50 శాతం కోత.. సేవలు మాత్రం అందడం లేదని ఆరోపణ

ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం ప్రతి నెలా బేసిక్ జీతంలో 1.50 శాతం కోత విధిస్తున్నప్పటికీ, తమకు అవసరమైన సమయంలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పోలీసు సిబ్బంది అంటున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఈహెచ్ఎస్ కింద చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోందని చెబుతున్నారు. ఈహెచ్ఎస్ కింద చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే పోలీసులకు ఎదురవుతున్న సమస్యలు, అవమానాలపై వివిధ జిల్లాలు, కమిషనరేట్లలోని పోలీసు అధికారుల సంఘాలకు 10 నుంచి 20 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని సంఘాల నాయకులు చెబుతున్నారు.

పోలీసుల ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

పని ఒత్తిడితో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత కూడా అత్యంత కీలకమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈహెచ్ఎస్ అమలులో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహితంగా సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం డబ్బుల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.