చిట్యాలలో యూరియా కొరతపై తహశీల్దార్కు వినతిపత్రం
చిట్యాలలో యూరియా కొరతపై తహశీల్దార్కు వినతిపత్రం
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చిట్యాల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ ఎం.విజయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు అరూరి శ్రీను మాట్లాడుతూ .చిట్యాల మండలంలో గత 15 రోజులుగా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ఫెర్టిలైజర్ యజమానుల వైఖరి వల్ల రైతులకు యూరియా అందడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, రైతు సంఘం నాయకులు జిట్టా సరోజ, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, ఐతరాజు నర్సింహా, సుర్కంటి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.