చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన
చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో తీవ్ర మంచి నీటి కొరత నెలకొంది. గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని మంచి నీటి పంపు చుట్టూ అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడంతో మురికి నీరు చేరి ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా పంపులో ఉన్న పైపులకు రంధ్రాలు పడటం వల్ల నీరు సరిగా రావడం లేదు. దీంతో గ్రామస్తులు రోజూ తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే అధికారులు స్పందించి పంపు మరమ్మతులు చేపట్టి, పరిసరాలను శుభ్రపరచి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.