BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చనుబండ, చిత్తపూరులో రేపు మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 02:52 PM
132 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చనుబండ, చిత్తపూరు గ్రామాల్లో రేపు 4వ తేదీ అనగా మంగళవారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు చనుబండ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చిత్తపూరు గ్రామంలో నిర్వహించే పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పాస్‌బుక్కులు అందజేస్తారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు