చనుబండ, చిత్తపూరులో రేపు మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చనుబండ, చిత్తపూరు గ్రామాల్లో రేపు 4వ తేదీ అనగా మంగళవారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు చనుబండ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చిత్తపూరు గ్రామంలో నిర్వహించే పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పాస్బుక్కులు అందజేస్తారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు