BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

డ్వాక్రా మహిళలకు ఊరట.. 10 మంది సభ్యులు లేకున్నా బ్యాంకు రుణాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
33 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సంఘాల్లో సభ్యుల సంఖ్య తగ్గినా రుణాల మంజూరుకు అడ్డంకులు లేకుండా నిబంధనలను సడలించింది.

ఇకపై డ్వాక్రా సంఘంలో 10 మంది సభ్యులు లేకపోయినా కనీసం 8 మంది క్రియాశీల సభ్యులు ఉంటే పునరావృత రుణాలు పొందే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా డ్వాక్రా సంఘాలకు ప్రయోజనం చేకూరనుంది.

స్త్రీనిధి పథకం ద్వారా అర్హత ఉన్న సంఘాలు సుమారు రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. అయితే రుణం మంజూరైన ఆరు నెలల్లోపు సంఘ సభ్యుల సంఖ్యను తిరిగి 10 మందికి పెంచుకోవాల్సి ఉంటుంది.

రుణం పొందేందుకు సంఘ సమావేశం నిర్వహించి ప్రత్యేక తీర్మానం చేయాలి. అనంతరం సంబంధిత పత్రాలతో బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని అధికారులు తెలిపారు.