BREAKING
అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
www.ntodaynews.com

ధాన్యం అమ్మి పది రోజులైనా రాని పైసలు.. చిట్యాల రైతుల ఆవేదన!

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Jun, 2026 - 07:14 PM
56 వీక్షణలు

ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పండించిన పంటను అమ్ముకున్నా  చేతికి పైసలు అందక అన్నదాతలు తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. గత నెల 29వ తేదీన వరి ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ట్రాక్ షీట్ ఆన్‌లైన్ చేయకపోవడంతో వందల మంది రైతులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీఏసీఎస్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం అమ్మి పది రోజులు దాటుతున్నా మొబైల్ ఫోన్లకు రావాల్సిన ఓటీపీ  కాస్తా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మరోవైపు కొత్త పంట పెట్టుబడులకు సమయం ఆసన్నమవుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. వరి కోసిన మిషన్ల వారికి, రవాణా చేసిన ట్రాక్టర్ల యజమానులకు బిల్లులు కట్టాలి. ఎరువుల షాపుల బాకీలు తీర్చాలి. ధాన్యం ఆరబోసిన కూలీలకు, పట్టాలు అద్దెకు ఇచ్చిన వారికి పైసలు ఇవ్వాలి అని . వీరందరికీ సమాధానం చెప్పలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పైసా లేక, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయారు. పంట అమ్ముకున్నాక కూడా డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి రావడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెద్దకాపర్తి పీఏసీఎస్ సెంటర్ పరిధిలోని రైతుల సమస్యను ఉన్నతాధికారులు తక్షణమే పరిశీలించాలని, వెంటనే ట్రాక్ షీట్లను ఆన్‌లైన్ చేసి, వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.