ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల (నస్పూర్):
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి సేకరిస్తున్న ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లింపులను సకాలంలో పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం నస్పూర్ లోని కలెక్టరేట్ ఆవరణలో గల జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న నగదు చెల్లింపుల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ట్యాబ్లలో ఆన్లైన్ నమోదు తప్పనిసరి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయడంతో పాటు, ట్యాబ్లలో (Tabs) కూడా తప్పనిసరిగా ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గడువులోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు