జిల్లా కలెక్టర్, డీఎస్పీతో జనసేన నేతల భేటీ
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు, మదనపల్లి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్లను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ భేటీలో రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి ఇన్చార్జ్ రాందాస్ చౌదరి, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ సిరివేలు చిన్నా రాయల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే సిరివేలు చిన్నా రాయల్ మాట్లాడుతూ, ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే జనవాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్, తంబళ్లపల్లె ఇన్చార్జ్ పోతుల సాయినాథ్, మదనపల్లి ఏఎంసీ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్, రాష్ట్ర చేనేత కార్యదర్శి అడపా సురేందర్, సీనియర్ నాయకుడు తోట కల్యాణ్, ఐటీ కో-ఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, వీర మహిళలు, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube