నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన..
నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు
నూజివీడు, జూన్ 3 అనగా రేపు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 8 గంటలకు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో 101 మంది లబ్ధిదారులకు సుమారు రూ.61 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేయనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు నూజివీడు పట్టణంలోని రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఎస్ఐఆర్ (Special Intensive Revision) వర్క్షాప్ అవగాహన సదస్సులో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ కార్యక్రమాలకు బూత్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, క్లస్టర్ ఇన్చార్జులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు.
ముఖ్య గమనిక: కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.