BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 17 July 2026, 09:58 pm
Posted by : V శ్రీనివాస్

​మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకులు కన్నుమూత

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 09:58 PM
97 వీక్షణలు

​మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకులు కన్నుమూత - నివాళులర్పించిన మేయర్, మున్సిపల్ అధికారులు

​మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేట గ్రామానికి చెందిన మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకులు అనారోగ్యంతో కన్నుమూశారు. మున్సిపాలిటీకి సుదీర్ఘకాలం పాటు తన వంతుగా ఎన్నో విశేష సేవలందించిన ఆయన, నిన్న రాత్రి 10 గంటల సమయంలో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త స్థానికంగా మరియు తోటి మున్సిపల్ కార్మికులలో తీవ్ర విషాదాన్ని నింపింది.

​ఈ విషాద వార్త తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పెంట రాజయ్య (ధరణి మధుకర్), స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ లగిసెట్టి రాజయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం తదితరులు ఈరోజు గుడిపేటలోని అంకులు స్వగృహానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, మున్సిపల్ విభాగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకతప్తమైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, మనోధైర్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు