BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 17 July 2026, 10:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:05 PM
218 వీక్షణలు

పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన

జూలై 17: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస గృహాల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఆర్డీవో కుమార్ శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి భూములను పరిశీలించారు.

పునరావాస గృహాల నిర్మాణానికి సుమారు 100 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట సమీప ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో, భూమి యజమానులైన రైతులతో సమావేశమై భూసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తే తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు రైతులు అధికారులకు తెలిపారు. భూముల అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మెట్టగుట్ట సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటుతో జనాభా పెరిగి, అక్కడి శేషాచల శ్రీనివాస స్వామి ఆలయానికి కూడా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.