BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:05 PM
40 వీక్షణలు

పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన

జూలై 17: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస గృహాల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఆర్డీవో కుమార్ శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి భూములను పరిశీలించారు.

పునరావాస గృహాల నిర్మాణానికి సుమారు 100 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట సమీప ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో, భూమి యజమానులైన రైతులతో సమావేశమై భూసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తే తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు రైతులు అధికారులకు తెలిపారు. భూముల అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మెట్టగుట్ట సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటుతో జనాభా పెరిగి, అక్కడి శేషాచల శ్రీనివాస స్వామి ఆలయానికి కూడా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.