BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 17 July 2026, 10:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:06 PM
79 వీక్షణలు

అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు మరో శుభవార్త అందించింది. ఈ నెల 22న తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో, ఈసారి సుమారు 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.

మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన పిల్లలకు రూ.13 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించనుంది.

గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కాలేదు. అయితే ఈసారి ఆ పరిమితులను సడలించి వారికి కూడా పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో వేలాది అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.