అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు
అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు మరో శుభవార్త అందించింది. ఈ నెల 22న తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో, ఈసారి సుమారు 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.
మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన పిల్లలకు రూ.13 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించనుంది.
గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కాలేదు. అయితే ఈసారి ఆ పరిమితులను సడలించి వారికి కూడా పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో వేలాది అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.