కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ
కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం కొండపర్వ, జూన్ 2: జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆధ్వర్యంలో సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మూడు రోజుల ఉచిత ఫౌండేషన్ కోర్సును నిర్వహిస్తున్నట్లు కృష్ణ సుధా వ్యవసాయ పర్యావరణ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు కొండపర్వలోని కేంద్రంలో జరగనుంది.
NGOలు, FPOలు, SHGలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగంపై ఆసక్తి కలిగిన ఇతర సంస్థల ప్రతినిధులు ఈ శిక్షణలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సహజ వ్యవసాయ విధానాలు, సేంద్రియ సాగు పద్ధతులు, బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ల (BRCs) ఏర్పాటు, నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
పాల్గొనదలిచిన వారు forms.gle� ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8500 28 3300 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు.