BREAKING
కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు!
www.ntodaynews.com

కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 07:12 PM
13 వీక్షణలు

కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం కొండపర్వ, జూన్ 2: జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆధ్వర్యంలో సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మూడు రోజుల ఉచిత ఫౌండేషన్ కోర్సును నిర్వహిస్తున్నట్లు కృష్ణ సుధా వ్యవసాయ పర్యావరణ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు కొండపర్వలోని కేంద్రంలో జరగనుంది.

NGOలు, FPOలు, SHGలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగంపై ఆసక్తి కలిగిన ఇతర సంస్థల ప్రతినిధులు ఈ శిక్షణలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సహజ వ్యవసాయ విధానాలు, సేంద్రియ సాగు పద్ధతులు, బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల (BRCs) ఏర్పాటు, నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

పాల్గొనదలిచిన వారు forms.gle⁠� ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8500 28 3300 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.