పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం
పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు, రాంపల్లి లోని మాజీ సైనిక సంక్షేమ సంఘ భవనం లో మాజీ సెంట్రల్ ఫారా మిలిటరీ ఫోర్స్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మాజీ సెంట్రల్ పారా మిలిటరీ సభ్యులు, వారి కుటుంబాలు, అలాగే విధి నిర్వహణ లో అమరులైన CAPF భార్య పిల్లలు లు, CGHS డిస్పెన్సరీ హాస్పిటల్ గురించి, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విద్య గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడైనా సమావేశం అవ్వాలంటే మదనపల్లి పీలేరు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పుంగనూరు లోనే ప్రారంభించడం చాలా సంతోషం గా వున్నదని సభ్యులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో అన్నమయ్య జిల్లా అసోసియేషన్ సభ్యులు ఇన్స్పెక్టర్ P. రామచంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆది నారాయణ,అలాగే పుంగనూరు అసోసియేషన్ సభ్యులు వెంకటరత్నం శెట్టి, సుబ్రహ్మణ్యం రాజు, నందేశ్వర్, జయ చంద్ర రెడ్డి, చoగారెడ్డి, వేణుగోపాల్, చెంగప్ప, పరామశివయ్య, కృష్ణప్ప, జగదీష్ రాజు, పురుషోత్తం, రెడ్డప్ప, అడన్ రెడ్డి, అమరనాథ గుప్త, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.