BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 06:50 PM
116 వీక్షణలు

ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు: డి. హరినాథ్

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సైలో కాంట్రాక్టులను ఆదానీ గ్రూప్‌కు అప్పగించే చర్యలు దేశ ఆహార భద్రతకు ప్రమాదకరంగా మారతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

1964లో ఆమోదించిన ఫుడ్ కార్పొరేషన్ చట్టం ఆధారంగా 1965 జనవరి 1న ఎఫ్‌సీఐ ఏర్పాటైందని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా, పంపిణీ, గిట్టుబాటు ధరల కల్పన, దేశ ఆహార భద్రత పరిరక్షణ వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తోందని వివరించారు.

ఎఫ్‌సీఐలో ఏకాధిపత్యాన్ని నిరోధించేందుకు ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించడం ద్వారా ఆదానీ గ్రూప్‌కు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. ఈ ప్రక్రియ 2022లోనే ప్రారంభమైందని, నీతి ఆయోగ్ మరియు ఆర్థిక వ్యవహారాల శాఖల ఒత్తిడితో కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న సైలో ప్రాజెక్టులలో భారీ భాగం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిందని, మొత్తం 60 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంలో 46.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని అవే నియంత్రిస్తున్నాయని తెలిపారు. ఇది 77.5 శాతం నియంత్రణకు సమానమని చెప్పారు.

దేశ ఆహార భద్రత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపే ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు వ్యతిరేకించాలని హరినాథ్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుకూల కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.