BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఈ-మెడిసిన్ అమ్మకాలను నిలిపివేయాలి: మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 May, 2026 - 01:48 PM
99 వీక్షణలు

మంచిర్యాల : ఆన్‌లైన్ మెడికల్ (ఈ-మెడిసిన్) విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని మంచిర్యాల మెడికల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ మరియు తోగరు సుధాకర్ డిమాండ్ చేశారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందులను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయని, అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ-మెడికల్ విధానం వల్ల యువత సులభంగా డ్రగ్స్ (మత్తు పదార్థాలు) బారిన పడి, వాటికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల తలెత్తుతున్న ముప్పును గమనించి ప్రభుత్వం వెంటనే వీటిని నియంత్రించాలని వారు కోరారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న మెడికల్ షాపుల బంద్:

ఈ-మెడిసిన్ విక్రయాలకు నిరసనగా అసోసియేషన్ పిలుపునిచ్చిన మెడికల్ షాపుల బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా, ప్రశాంతంగా కొనసాగుతోంది. రోగులకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు మినహా, వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు