BREAKING
ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
www.ntodaynews.com

ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
14 Aug, 2026 - 06:30 PM
21 వీక్షణలు

సైదాబాద్ ఆగస్టు 14/ ఎన్ టుడే న్యూస్.

హైదరాబాద్ సౌత్ కమిటీ పిలుపు 

హైదరాబాద్ మహానగరంలో లక్షలాదిమంది తమ జీవనోపాధి కోసం ఆటో క్యాబ్ రవాణా రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ జీవిస్తున్నారు అలాంటి రవాణా రంగ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి అన్ని కార్మిక సంఘాల తోటి సమావేశం జరిపి కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ ఓటు వేసి రేవంత్ రెడ్డిని గెలిపించారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు గడిచింది కానీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని సిఐటియు ట్రాన్స్పోర్ట్ జిల్లా కార్యదర్శి ఎల్ కోటిరెడ్డి విమర్శించారు హైదరాబాద్ సౌత్ జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ లో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈనెల 23వ తారీకు నుంచి జాయింట్ ఆక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళుతున్న సంగతి అందరికీ తెలిసినదే పలుదపాలుగా కార్మిక సంఘాల తోటి చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు శూన్యం అని అన్నారు సైదాబాద్ ఆటో కమిటీ కార్యదర్శి ఆడెపు కృష్ణ అధ్యక్షతన జరిగిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాన్స్పోర్ట్ రంగం కార్యదర్శి ఎల్ కోటయ్య హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ రంగం నాయకులు సైదాబాద్ ట్రాన్స్పోర్ట్ ఉపాధ్యక్షులు మద్దిమడుగు వెంకటేష్ మరియు నాగేష్ పుప్పాల నిరంజన్ వెంకటేష్ వెంకటయ్య ఏసోబు ఎర్రబుడ్డ తదితరులు పాల్గొన్నారు