కంటాయపాలెం గ్రామపంచాయతీ లో గ్రామ సభ
పాలకుర్తి రిపోర్టర్ కంటాయపాలెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పాటు చేసినటువంటి గ్రామసభ కార్యక్రమంలో పర్యావరణం పరిరక్షణ లో భాగంగా చెత్తను వేరు చేసే విధానాలు, వాటిని ఎరువులుగా మార్చే విధానాల గురించి అగ్రికల్చర్Aeo గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి పట్టాలు అనే సమస్యల గురించి RI గారు ప్రజా ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ నుండి మేడం గారు, గ్రామ అభివృద్ధికి కావలసినటువంటి అభివృద్ధి పనుల గురించి , గ్రామంలోని చదువుకునే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, మంచి విద్యను అందజేస్తే ఉపాధ్యాయులు మన గ్రామానికి అందుబాటులో ఉన్నారని,గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచారి గారు మాట్లాడారు.
గ్రామంలో కరెంటు సమస్యల గురించి వాటి పరిష్కారం గురించి ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు మాట్లాడడం జరిగింది.
గ్రామంలో రైతులు కష్టపడి పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేసుకునేందుకు ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫునుండి ప్రభుత్వాధికారులకు తెలియజేయడానికి కృషి చేయాలని రైతులకు కోరారు. మహిళా సంఘానికి సంఘ భవన నిర్మాణానికి జరగాల్సిన అభివృద్ధి పనులను త్వరగా మొదలుపెట్టాలని గ్రామ ప్రజలు మాట్లాడడం జరిగింది