ఎల్పీజీ వినియోగదారులకు కీలక సమాచారం.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు
ఆగస్టు 23లోగా పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీల సూచన
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక సమాచారం అందించాయి. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఆగస్టు 16తో ముగిసిన గడువును తాజాగా ఆగస్టు 23 వరకు పొడిగించారు.
లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఈ-కేవైసీ నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు.
మరోవైపు సర్వర్ సమస్యల వల్ల ఆన్లైన్లో ఈ-కేవైసీ పూర్తి కావడం లేదని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు.