ఎం జి యూత్ కమిటీకి ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా
ఎం జి యూత్ కమిటీకి ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజి యూత్ కమిటీ సభ్యులు ఆదివారం నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. 9వ వార్డు కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ సమక్షంలో నూతన కమిటీని పరిచయం చేసి, ఎమ్మెల్యే వేముల వీరేశంను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎంజి యూత్ కమిటీకి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు బెల్లి సత్తయ్య, అధ్యక్షులు ఖమ్మంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, గౌరవ సలహాదారులు ఏళ్ల మల్లేశం, బొడ్డుపల్లి చంద్రశేఖర్, కొలనుచెల్మి జంగయ్య, కొలనుచెల్మి మల్లేష్, ఉపాధ్యక్షులు చింతకుంట్ల తిరుపతిరెడ్డి, ఊట్కూరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు గండూరి రవి, బంధారపు నరేష్, నల్ల మహేందర్ రెడ్డి, మాసంపల్లి బిక్షం, శేరి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.