గంగారంలో చదువుకోమని తండ్రి మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ
/
ఖమ్మం
సత్తుపల్లి: చదువుపై దృష్టి పెట్టాలని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన చరణ్ రెడ్డి ఖమ్మంలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు చదువుపై దృష్టి పెట్టకుండా తిరుగుతుండటంతో తండ్రి బుద్ధిగా చదువుకోవాలని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన చరణ్ రెడ్డి క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.