గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు
తెలంగాణలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, లౌడ్స్పీకర్ల వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుంది.
నివాస ప్రాంతాల్లో శబ్ద తీవ్రత 55 డెసిబుల్స్కు మించకూడదని అధికారులు స్పష్టం చేశారు. పగటిపూట కూడా అనుమతించిన పరిమితుల్లోనే శబ్దం ఉండాలని సూచించారు.
అదేవిధంగా పాఠశాలలు, ఆస్పత్రుల చుట్టూ 100 మీటర్ల పరిధిని నిశ్శబ్ద ప్రాంతంగా ప్రకటించారు. ఈ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా శబ్దం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
శబ్ద తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు డెసిబుల్ మీటర్లతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గణేష్ ఉత్సవాల నిర్వాహకులు నిబంధనలు పాటించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు సూచించారు.