BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 09:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిట్వేలి–రాపూరు ఘాట్‌లో చిరుతల కలకలం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 09:46 AM
12 వీక్షణలు

చిట్వేలి–రాపూరు ఘాట్‌లో చిరుతల కలకలం..! తరచూ రోడ్డుపై ప్రత్యక్షం.. వాహనదారుల్లో భయాందోళన

రాత్రివేళ ద్విచక్ర వాహనాలపై వెళ్లొద్దంటున్న అటవీశాఖ

తిరుపతి: తిరుపతి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిట్వేలి–రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతలు తరచూ కనిపిస్తుండటంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.

ఘాట్ రోడ్డులోని అటవీ ప్రాంతం నుంచి చిరుతలు రహదారి వైపు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

చిరుతలు సంచరించే ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప రాత్రివేళ ఘాట్ రోడ్డులో ప్రయాణించకుండా ఉండాలని సూచించారు.

చిరుతల కదలికలపై అటవీశాఖ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. రహదారిపై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని, చిరుతలు కనిపిస్తే వాటిని వెంబడించడం, దగ్గరకు వెళ్లడం లేదా ఫొటోలు, వీడియోల కోసం ప్రయత్నించడం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.