తెలంగాణలో రైతుబీమాపై కీలక నిర్ణయం ఇందిరమ్మ బీమా అమల్లోకి వచ్చే వరకు రైతుబీమా కొనసాగింపు
తెలంగాణ
తెలంగాణలో ఇందిరమ్మ బీమా పథకం అమల్లోకి వచ్చే వరకు రైతుబీమా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
రైతుల మరణాల నమోదుకు మంగళవారం నుంచి రైతుబీమా పోర్టల్ను తిరిగి తెరిచారు. గతంలో మాదిరిగానే ఏఈవోలు మృతి చెందిన రైతుల వివరాలను పోర్టల్లో నమోదు చేయనున్నారు.
అయితే ఇప్పటివరకు ప్రభుత్వం రెన్యువల్ ప్రీమియం చెల్లించకపోవడంతో, రైతు కుటుంబాలకు పరిహారం ఎప్పుడు, ఏ విధంగా అందిస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.