www.ntodaynews.com
జీలుగుమిల్లి కాపుల బజార్లో ఘనంగా నిర్వహించిన గణేష్ విగ్రహ ఊరేగింపు
తెలంగాణ
జీలుగుమిల్లి కాపుల బజార్లో ఘనంగా నిర్వహించిన గణేష్ విగ్రహ ఊరేగింపు
NTODAY NEWS: జీలుగుమిల్లి రిపోర్టర్ వీరమల్ల శ్రీను
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి కాపులు బజార్లో గణేష్ విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి వేడుకలు ప్రజల ఐక్యతకు, భక్తి భావానికి ప్రతీక అని తెలిపారు. పండుగలు సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, యువతలో సేవా భావం, సమాజ పట్ల బాధ్యత పెరగాలని సూచించారు. ఉత్సవంలో పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్థానిక కమిటీ సభ్యుల కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము,బిజెపి నాయకులు కోలా ధర్మరాజు, కోలా లక్ష్మణ్, జనసేన నాయకులు కోలా మధు, పాలోజి దుర్గా ప్రసాద్, నారగాని నరేంద్ర, చామన శేఖర్, కొట్టే శాంతి కుమార్, అనిల్, సురేష్, రాజేష్ స్థానిక ప్రజలు, యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube