BREAKING
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
www.ntodaynews.com

జల్సాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 11:28 PM
9 వీక్షణలు

రూ. 6.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం..

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ 

అన్నమయ్య జిల్లా మదనపల్లి క్రికెట్ బెట్టింగ్లు, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అంతర్రాష్ట్ర స్థాయిలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక కరుడుగట్టిన దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మంగళవారం మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు కేసు వివరాలను వెల్లడించారు.

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంకు చెందిన షేక్ ఖజాపిర్ (30). వృత్తిరీత్యా పెయింటర్ అయిన ఇతనికి పెద్ద కుటుంబం ఉండటం, ఆదాయం చాలకపోవడంతో పాటు క్రికెట్ బెట్టింగ్లకు బానిసై చోరీల బాట పట్టాడు.

జూన్ 23 ఉదయం చిన్నమండెం మండలం, వండాడి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడుపట్టుబడ్డాడు.

రికవరీ చేసిన సొత్తు: చిన్నమండెం, కలకడ, గుర్రంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన రూ.6 లక్షల విలువైన 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల విలువైన 250 గ్రాముల వెండి వస్తువులు మరియు ఒక స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేర చరిత్ర: నిందితుడిపై గతంలో అనంతపురం జిల్లాలో 20, కర్ణాటకలో 10, అన్నమయ్య జిల్లాలో 10 పాత కేసులు ఉన్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో నమోదైన 7 కేసుల్లో ఇతనే ప్రధాన ముద్దాయి.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి గారు పలు కీలక సూచనలు చేశారు..

యువత క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ జూదాలు వంటి జల్సాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ నేరాల వైపు అడుగులు వేయిస్తుంది.

వేసవి సెలవులు లేదా ఇతర పనుల నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారంఅందించాలి.

దొంగతనాలను నివారించడానికి ప్రతి కాలనీ, వీధుల్లో, వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

మీ పరిసరాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా