BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 11 September 2026, 04:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గ్రేటర్ వరంగల్‌కు యూజీడీ ప్రాజెక్టు ఎప్పుడో?

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Sep, 2026 - 04:30 PM
5 వీక్షణలు

రూ.5,257 కోట్లకు అనుమతులు.. టెండర్‌ నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు

వరంగల్ | Ntoday News

గ్రేటర్‌ వరంగల్‌ నగరానికి భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టు కల ఇంకా సాకారం కాలేదు. నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినప్పటికీ, పనుల ప్రారంభానికి అవసరమైన టెండర్‌ ప్రక్రియ ఇంకా ముందుకు సాగలేదు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 జూన్‌లో గ్రేటర్‌ వరంగల్‌కు యూజీడీ ప్రాజెక్టును ప్రకటించారు. అనంతరం 2026 మార్చిలో రూ.5,257.20 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఏప్రిల్‌లోనే టెండర్లు పిలవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు టెండర్‌ నోటిఫికేషన్‌ వెలువడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రాజెక్టు అమలులో భాగంగా భూసేకరణ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇందుకోసం ఆగస్టు 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. భూసేకరణ పూర్తయిన అనంతరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే అవకాశం ఉంది.

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో యూజీడీ పనులను నాలుగు ప్యాకేజీలుగా, తొమ్మిది జోన్లలో చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మురుగునీటిని సమర్థంగా సేకరించి శుద్ధి చేసేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు.

భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రేటర్‌ వరంగల్‌లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో డ్రెయినేజీ సమస్యలు, నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. అయితే అనుమతులు వచ్చినా టెండర్‌ ప్రక్రియలో జాప్యం కొనసాగుతుండటంతో యూజీడీ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది.