www.ntodaynews.com
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక
ఆంధ్రప్రదేశ్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక
ఎస్సీ కోటాలో వర్ల రామయ్య.. బీసీ కోటాలో దళవాయి రమాదేవికి అవకాశం
అమరావతి:
ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లు ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను ఎంపిక చేసింది.
సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్యకు, బీసీ వర్గం నుంచి దళవాయి రమాదేవికి ప్రాతినిథ్యం కల్పించారు.
పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వర్ల రామయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించగా, బీసీ మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందిన దళవాయి రమాదేవికి మరో స్థానాన్ని కేటాయించారు.
గవర్నర్ ఆమోదం అనంతరం ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ పూర్తికానుంది.