ఘనముగా జరిగిన 116వ మదర్ తెరిసా జన్మదిన వేడుక
ఘనంగా జరిగిన 116వ మదర్ తెరిసా జన్మదిన వేడుక
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఈరోజు షాలోమ్ సేవా సంస్థ మరియు పార్ట్ ఇండియా యు సి ఎం సంయుక్తంగా నిర్వహించిన
మధర్ థెరిస్సా పుట్టినరోజు కార్యక్రమంలో బలుసు సత్యనారాయణ పార్డ్ ఇండియా మేనేజర్, సోమిశెట్టి. వెంకటరావు ఆశ వర్కర్లు పాల్గొన్నారు విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి కేక్ కట్ చేసి మధర్ థెరిస్సా ను పురస్కరించుకొని మానవతా సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ బలుసు సత్యనారాయణ మధర్ ఎన్నో సేవలు అందించారని పేదవారికి నిరాశ్రయులకు అనారోగ్యంతో ఉన్న కుష్ట్రోగులకు ఆకలితో అలమటిస్తున్న వారికి సేవలు అందించారని తన సందేశంలో తెలియపరిచారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన షాలోమ్ సేవా సంస్థ అధ్యక్షులు డేవిడ్ మాట్లాడుతూ మదర్ తెరిసా 116వ జన్మదిన వేడుకలో మాకు సహకరించిన పార్ట్ ఇండియా సేవా సంస్థకు అలాగే యు సి ఎం వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మదర్ తెరిసా చేసిన సేవలు 120 దేశాలకు స్ఫూర్తినిచ్చాయని భారతరత్న నోబెల్ బహుమతి శాంతినికేతన్ విశ్వ భారతి యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం నెహ్రూ అవార్డు పొందడం వేల లక్షల నగదు పొందుకోవడం బంగారు పథకాలు తీసుకోవడం ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఎన్నో అవార్డ్స్ పొందుకోవడం జరిగిందని కొనియాడారు కార్యక్రమంలో పులిహార ప్యాకెట్స్ స్వీట్లు పంచి ఆటల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు వృద్ధులకు దుప్పట్లు రైసు కూరగాయలు పప్పు దినుసులు మొక్కలు పంపిణీ చేశారు దేవరపల్లి జనతా హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చిన గ్రామ ప్రజలకు ఉచితముగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో షాలోమ్ సేవా సంస్థ అధ్యక్షులు ఈడూరి. డేవిడ్ ఈ. జెస్సీ, ఏ మోహన్ ఎన్ తేజస్ టి. ఇందిరా లిల్లీ సిహెచ్ శాంతి మరియు యునైటెడ్ పాస్టర్స్ యు సి ఎం సేవకులు అసోసియేషన్ నెంబర్ వన్ సేవకులు తదితరులు పాల్గొన్నారు