BREAKING
thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి
Date of Publish : 18 September 2026, 10:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను చెరువుకు చేరిన గోదావరి జలాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 10:57 PM
9 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న చెరువుకు ఎన్‌ఎస్‌పీ కాలువ ద్వారా గోదావరి జలాలు చేరుతున్నాయి. గత ఐదు రోజులుగా చెరువులోకి నీరు వస్తున్నట్లు ఆయకట్టు రైతులు తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సాగర్ కాలువ రెండో జోన్ ద్వారా నీటిని విడుదల చేసినట్లు రైతులు తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం మండలాలకు గోదావరి జలాలు తరలుతున్నాయి. ఈ నీటి మార్గంలో పెనుగొలను గ్రామం ఉండటంతో అక్కడి చెరువుకు కూడా నీరు చేరుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులో నీరు పూర్తిగా తగ్గిపోయిన సమయంలో అనూహ్యంగా గోదావరి జలాలు చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చెరువులోకి నీరు రావడంతో సాగుకు కొంత భరోసా ఏర్పడిందని ఆయకట్టు రైతులు తెలిపారు. పెనుగొలను చెరువుకు గోదావరి జలాలు చేరేందుకు చర్యలు తీసుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.