శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు:శారదా కాలనీలో వెంకటేశ్వరరావు (50) అనే తాపీ మేస్త్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు మద్యం సేవిస్తున్న విషయమై భార్య మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బావమరిది వెంటనే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (GGH) తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.